<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » news
Weather Update: తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వీడలేదు. ఇప్పటికే పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వడగళ్ల వాన, గాలి బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున వడగళ్లు కురవడంతో రోడ్లన్నీ తెల్లని తివాచీ పరిచినట్లు కనిపించాయి. పెద్దఎత్తున కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. గాలి బీభత్సానికి అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి తోటలలో పూత, పిందె రాలిపడ్డాయి. ఇప్పటికే రైతన్నలు దిగాలు పడిపోయారు. ఇదిలా ఉండగానే మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో […]
Naveen Murder Case: సంచలనం సృష్టించిన హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో హరి ప్రియురాలు నిహారికకు బెయిల్ దొరికింది. ఈ కేసులో నిందితుడు హరిహర కృష్ణతో పాటు ప్రియురాలు నిహారికను, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ3గా, స్నేహితుడు హసన్ను ఏ2గా పోలీసులు చేర్చారు. నవీన్ హత్యకు నిహారికాతో ప్రేమ వ్యవహారమే కారణం కాగా నిహారికాకి తెలిసే అన్నీ జరిగాయని ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పారు. నవీన్ హత్య గురించి […]
Bandi Sanjay: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించారు. కవితపై వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దానం నాగేందర్ ఫిర్యాదు ఆధారంగా సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు […]
Bangladesh Bus Accident: బంగ్లాదేశ్లో ఘోర బస్పు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనున్న కాలువలోకి చొచ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా 30 మందికిపైగా గాయపడ్డారు. బంగ్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తోండగా ఈ ప్రమాదం జరిగింది. సోనాదంగా నుంచి ఢాకాకు ఈ బస్సు బయల్దేరింది. ఉదయం 7.30 సమయంలో […]
Gold Price Today: అసలే పెళ్లిళ్ల సీజన్.. ఎంతో కొంత బంగారం కొనాలని మధ్య తరగతి నుండి ఎగువ తరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వారికి ఇది షాకింగ్ న్యూస్. పసిడి రేటు పరుగులు పెడుతోంది. ఎన్నడూ లేనంతగా కొండెక్కి కూర్చుంది. గోల్డ్ రేట్ ఇప్పుడు ఆల్టైమ్ గరిష్టాన్ని తాకింది. బంగారం ధర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. పసిడి రేటు ఆల్టైమ్ గరిష్టాన్ని నమోదు చేస్తూ ఏకంగా రూ. 60 వేలు దాటిపోయింది. మన […]
Pregnant Woman Raped: మన సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు కుంచించుకుపోతున్నాయి. మంచి, చెడు, విచక్షణ, పాపం పుణ్యం అనేవి కొందరిలో కనీసం చూద్దామన్నా కనిపించడం లేదు. చట్టాలు, న్యాయాలు అనేది పక్కన పెట్టినా కనీసం సాటి మనిషిగా కూడా ఆలోచించలేని రోగులు మన సమాజంలో పెరిగిపోతున్నారు. అందుకే కొన్ని ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందోనన్న ఆశ్చర్యం కలిగించకమానదు. ఒక్కోసారి ఒక్కో గురించి తెలుస్తుంటే బాధ, భయం, కోపం వస్తుంటాయి. అటువంటి ఘటనే ఇది. ఓ […]
Road Accident: తెలుగు రాష్ట్రాలలో రోడ్లు నిత్యం రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. అధికారులు, పోలీసులు భారీ అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ప్రమాదాలకు బ్రేక్ పడడం లేదు. ప్రైవేట్ వాహనాలే కాదు ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డివైడర్ ను ఢీకొన్న ఆ ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బస్సు డివైడర్ ఎక్కే సమయంలో […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ విచారణ, ఈడీ నోటీసులపై కవిత సుప్రీంకోర్డును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫు లాయర్ వివరించారు. ఈ […]
MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా సాధారణ ఎన్నికల స్థాయిలో ఉత్కంఠ రేపాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరా పోటీ కనిపించింది. అయితే, ఒక్కో రౌండ్ పూర్తవుతుంటే ఫలితాలు ప్రతిపక్ష టీడీపీకి మెజార్టీగా కనిపించింది. ఏపీలో పట్టభద్రులకు జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలలో మూడు టీడీపీ సొంతం చేసుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్ తొలి […]
Heavy Rains in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు రోజులపాటు కూడా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. శని, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే […]