<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Cheddi Gang: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్చల్ చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. జిల్లా కేంద్రంలో వరస చోరీలతో చెడ్డి గ్యాంగ్ భయాందోళనకు గురిచేశారు. స్థానిక బృందావన్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. గతంలో అదే కాలనీలో చెడీ గ్యాంగ్ చోరీకి ప్రయత్నించి విఫలమై వెనుతిరిగగా.. నాలుగు రోజుల క్రితం ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారం దోపిడీ చేశారు. చెడ్డీ గ్యాంగ్ అంటేనే చోరీలతో […]
Kadapa Accident: కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని చాపాడు మండలం వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రొద్దుటూరు వైఎమ్మార్ కాలనికి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు […]
Deccan Complex: డెక్కన్ మాల్లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. భవనం దగ్గరికి అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు. నేడు కాలిన భవనాన్ని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. భవనంలోని గోడౌన్కు పర్మిషన్ లేదని జీహెచ్ఎంసీ చెబుతోంది. సెల్లార్లో చిక్కుకున్న వారిపై ఇంకా స్పష్టత రాలేదు. పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్పేట డెక్కన్ స్టోర్లో చెలరేగిన మంటలు […]
Vijayawada Politics: బెజవాడ రాజకీయాలలో కీలక మార్పులు జరగనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఒకపక్క కేశినేని బ్రదర్స్ ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగుతుంటే మైలవరం నుండి ఊహించని రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. మైలవరం నుండి వయా జగ్గయ్యపేట మీదగా విజయవాడ వరకు తెలుగు దేశం పార్టీలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. మిగతా రాష్ట్రం మొత్తం ఇంకా సమయం ఉంది కదా అని వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నా.. కృష్ణాజిల్లాలో మాత్రం రాజకీయం ఓ రేంజిలో […]
Byreddy Siddharth: వైఎస్ జగన్ కు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అభిమానులు ఉన్నారు, ఆయన కనుక మళ్ళీ తెలంగాణలో వేలు పెడితే తెలంగాణ రాజకీయాల సీన్ మారిపోతుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఏపీలో వైసీపీలో యూత్ ఫాలోయింగ్ ఉన్న నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. ఆ మాటకొస్తే ఇప్పుడే కాదు.. గత కొన్నాళ్ళుగా సిద్దార్థ్ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. నిజానికి ఏపీ రాజకీయాల్లో అందునా రాయలసీమలో మంచి భవిష్యత్ ఉన్న యువ నేత […]
AP Govt: ఒకప్పుడు ఏపీ రాజకీయాలలో అధికార, ప్రతిపక్షాల మధ్య పాలనా యుద్ధం తలపించేది. కానీ, ఎందుకో ఈ మధ్య కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షంగా ప్రభుత్వ నిర్ణయాలపై యుద్ధం తగ్గించారు. మాటల దాడి చేస్తున్నారు కానీ ప్రభుత్వ నిర్ణయాలు తప్పని నిరూపించే ప్రయత్నం మాత్రం తగ్గించారు. అయితే.. ఆ లోటును మిగతా ప్రతిపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు.. కోర్టులు తీరుస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపైన కమ్యూనిస్ట్ పార్టీలు హైకోర్టుకు వెళ్తే జీవోను […]
Hyderabad: ముంబైతో పాటు ఉత్తరాదిన మరికొన్ని నగరాలలో డబ్బావాలా అనే ఓకే కల్చర్ ఉంటుంది. ఇందులో చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకొనే వారు.. కొన్ని కొన్ని పనులకు వెళ్లిన వారు నగరంలో ఎక్కడ ఉన్నా.. వాళ్ళ ఇంటి నుండే డబ్బావాలాలు వాళ్ళు ఉన్న చోటుకి లంచ్ బాక్సులు ఇస్తారు. లోకల్ ట్రైన్, బస్సు, రిక్షా ఇలా రకరకాల వాహనాలు, బుట్టలలో డబ్బావాలాలు ఈ తరహా లంచ్ బాక్సులను అందిస్తుంటారు. వాళ్ళు వచ్చే సమయానికి ఇంట్లో లంచ్ బాక్స్ […]
Ayyanna Patrudu: కాస్త వయసు మీదపడినా టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడంటే ఇప్పటికీ ఫైర్ బ్రాండే. ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాలపై సోషల్ మీడియాలో సెటైర్లతోనే ఏకిపారేసే అయ్యన్న సొంత పార్టీ నేతలపై కూడా అప్పుడప్పుడు ఘాటు విమర్శలకు దిగుతుంటారు. ఇప్పుడు కూడా అలాగే టీడీపీ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర కీలక నేత గంటా శ్రీనివాసరావుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఎవడండీ గంటా.. ఏమైనా పెద్ద నాయకుడా అంటూ అయ్యన్న రెచ్చిపోయారు. ఓ పార్టీ కార్యక్రమంలో […]
Krishna District: ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఓ అంశం ఎప్పటికప్పుడు హీట్ పుట్టిస్తుంది. అదేమిటంటే ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ కు వారసుడు చంద్రబాబు కానేకాదని.. తామే అసలైన వారసులమని కొడాలి నానీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు హీట్ పుట్టించే కామెంట్స్ చేసే సంగతి తెలిసిందే. ఇక.. ఎన్టీఆర్ కుటుంబం ఎంత కాదన్నా ఎన్టీఆర్ కు రెండో భార్య లక్ష్మి పార్వతి కూడా ఇప్పుడు వైసీపీలోనే ఉన్న సంగతి తెలిసిందే. […]
Minister Ambati: ప్రతిపక్షాలను మాటలతోనే దుమ్ముదులిపేసే మంత్రిగా పేరున్న ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదైంది. అది కూడా ఏపీలో నిషేధించబడిన లాటరీలను నిర్వహించారని.. మోసం చేసి లాటరీ టికెట్లను అమ్మేశారని ఈ కేసు నమోదు కావడం గమనార్హం. మంత్రి అంబటి రాంబాబు ఫోటోతో ముద్రించిన లక్కీ లాటరీ టికెట్లను సత్తెనపల్లి నియోజకవర్గంలో కొందరు అమ్ముతున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, వంద రూపాయలు కట్టి లక్కీ లాటరీలో […]