<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Hit by Train: ఏపీలోని నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన శనివారం రాత్రి జరిగింది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నున్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళ వస్తుండగా- గూడూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే […]
TDP: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది.. ‘యువగళం’ పేరుతో ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రని టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసులోగా.. దీనికి సంబంధించి భారీ యాక్షన్ ప్లాన్.. రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. అయితే ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ జనవరి 12న డీజీపీతో పాటు మిగతా ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. డీజీపీ, హోంసెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డీఎస్పీలకు […]
TCongress: తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే పాదయాత్ర 60 రోజులపాటు సాగుతుంది. భద్రాచలం లేదా మహబూబ్ నగర్ లేదా ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలు పెట్టనున్నట్లు రేవంత్ చెప్పారు. వాస్తవానికి జనవరి […]
Vundavalli Aruna Kumar: ఉండవల్లి అరుణ్ కుమార్.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా.. ఇప్పటి రాజకీయాలపై విశ్లేషణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసే నేత. ఉండవల్లి మీడియా ముందుకొస్తే ఇప్పటి రాజకీయాలపై ఆయన విశ్లేషణ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాళ్ళ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన కూడా ఓ రేంజిలో మీడియాకి, ప్రజలకు మాట్లాడుకునేందుకు స్టఫ్ ఇచ్చేసి వెళ్తుంటారు. ఎప్పటిలాగానే మరోసారి ఉండవల్లి ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో […]
Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రానే వచ్చింది.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొడుతోంది. విమానాన్ని తలపించేలా సౌకర్యాలున్న రైలు కావడంతో కాస్త ధర ఎక్కువే అయినా ప్రయాణికులు కూడా ఈ రైల్లో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. సికింద్రాబాద్- విశాఖపట్నం.. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ సెమీ హైస్పీడ్ రైలుకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ కూడా వచ్చింది. వందే భారత్ […]
Gudivada Amarnath: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయి ఎనిమిదేళ్ళయినా ఇప్పటికీ ఏపీకి రాజధాని అంశం పెద్ద రగడగానే ఉన్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా నిర్ణయించి తాత్కాలిక భవనాలను నిర్మించి పరిపాలన మొదలుపెట్టగా.. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అమరావతి ఒక్కటే కాదు.. మూడు రాజధానులు కావాలని అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారు. అయితే.. దీనిపై నేటికీ న్యాయ స్పష్టత లేదు. అప్పటి ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాలు.. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన […]
Srisailam: గత ఆరు నెలలుగా శ్రీశైలం మల్లన్న దేవస్థానంపై విమర్శల జడివాన కురుస్తుంది. ట్రస్ట్ బోర్డు సభ్యులు రెండు వర్గాలు విడిపోయి.. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడంతో అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ట్రస్ట్ బోర్డు లెటర్ ప్యాడ్ లు, బోర్డు సభ్యుల రెకమెండేషన్లతో కొందరు టికెట్లు లేకుండానే మల్లన్న దర్శనాలకు వెళుతున్నట్లు భారీ విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న లడ్డూల తయారీ ముడి సరుకుల కొనుగోలులో అక్రమాలు జరిగాయని సాక్షాత్తు చైర్మన్ రెడ్డివారి […]
AP Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కసరత్తు చేస్తోంది జగన్ సర్కార్. ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఫిబ్రవరి చివరి వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం సుమారు 22 పని దినాలు ఉండేలా సమావేశాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఫిబ్రవరిలో అసెంబ్లీలో సమావేశాలు కుదరకపోతే కనుక మార్చి 3, 4న […]
Telangana Budget 2023: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి తొలివారంలో 3 లేదా 5 తేదీలలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫిబ్రవరి తొలి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్టు రాష్ట్ర రాజకీయ వర్గాలలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు 2023-24 రాష్ట్ర తాత్కాలిక బడ్జెట్ను ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీల్లో సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్పై శనివారం ప్రగతి భవన్లో జరగనున్న అత్యున్నత స్థాయి […]
Chaganti Koteswara Rao: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలకపదవిని అప్పగించింది. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ… టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ […]