Home » Author » M N
Paper Leakage Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. 9 మంది నిందితులను సిట్ అధికారులు మూడోరోజు విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మరి కొందరిని విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది. అనుమానితుల విచారణను గోప్యంగా ఉంచుతున్న పోలీసులు.. గ్రూప్-1 పరీక్ష రాసి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నవారిని ఫోన్లో విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక కస్టడీలో […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుండి ఈ విచారణ కొనసాగుతుంది. సౌత్ గ్రూప్ లో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. అలాగే.. సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో వ్యాపార సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాదుల బృందం చేరుకుంది. ఈడీ ఆఫీస్ కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు.. న్యాయవాదులు […]
AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేశాయి. అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదనల నడుమ సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి. తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడ్డారని అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలకు దిగాయి. సభలో లేని వామపక్షాలు, జనసేన పార్టీలు కూడా సభలో జరిగిన పరిణామాలపై స్పందించడంతో రాజకీయం వేడెక్కింది. తమ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని […]
K.A.Paul: ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తాము, తమ పార్టీ పోటీ చేయకపోవడం వలనే టీడీపీ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్ పార్టీలు ప్రధాని మోడీకి బీ-పార్టీలని కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు, జగన్, కేసీఆర్, పవన్ కల్యాణ్ అన్ని విధాలుగా మోడీకి మద్దతు ఇస్తున్నారని పాల్ తెలిపారు. మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా? వీళ్లను నమ్మి మనం ఎందుకు మోసపోవాలని ప్రశ్నించారు. […]
Death of an elephant: పొలాల్లోకి వెళ్తున్న ఏనుగు అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి సంఘటన స్ధలంలోనే కుప్ప కూలింది. అక్కడిక్కడే మరణించింది. ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు జిల్లా ధర్మపురిలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల్లో వెళ్తున్న ఏనుగుకు విద్యుత్ వైర్లు తగిలడంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వీడియోను అక్కడున్నవాళ్లు షూట్ చేయడంతో ఇప్పుడది వైరల్గా మారింది. అయితే, వేటగాళ్లు ఏనుగుల కోసం విద్యుత్ తీగలను […]
Weather Update: తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వీడలేదు. ఇప్పటికే పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వడగళ్ల వాన, గాలి బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున వడగళ్లు కురవడంతో రోడ్లన్నీ తెల్లని తివాచీ పరిచినట్లు కనిపించాయి. పెద్దఎత్తున కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. గాలి బీభత్సానికి అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి తోటలలో పూత, పిందె రాలిపడ్డాయి. ఇప్పటికే రైతన్నలు దిగాలు పడిపోయారు. ఇదిలా ఉండగానే మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో […]
Naveen Murder Case: సంచలనం సృష్టించిన హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో హరి ప్రియురాలు నిహారికకు బెయిల్ దొరికింది. ఈ కేసులో నిందితుడు హరిహర కృష్ణతో పాటు ప్రియురాలు నిహారికను, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ3గా, స్నేహితుడు హసన్ను ఏ2గా పోలీసులు చేర్చారు. నవీన్ హత్యకు నిహారికాతో ప్రేమ వ్యవహారమే కారణం కాగా నిహారికాకి తెలిసే అన్నీ జరిగాయని ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పారు. నవీన్ హత్య గురించి […]
Delhi Police: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నివాసాన్ని ఢిల్లీ పోలీసులు భారీగా ముట్టడించారు. పోలీసుల ముట్టడి వ్యవహారం తెలియడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు కూడా రాహుల్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. కానీ కొద్దిసేపటికి పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ హైడ్రామా నడించింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మహిళల లైంగిక వేధింపులను ఉద్దేశించి వ్యాఖ్యలు […]
Bandi Sanjay: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించారు. కవితపై వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దానం నాగేందర్ ఫిర్యాదు ఆధారంగా సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు […]
Bangladesh Bus Accident: బంగ్లాదేశ్లో ఘోర బస్పు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనున్న కాలువలోకి చొచ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా 30 మందికిపైగా గాయపడ్డారు. బంగ్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తోండగా ఈ ప్రమాదం జరిగింది. సోనాదంగా నుంచి ఢాకాకు ఈ బస్సు బయల్దేరింది. ఉదయం 7.30 సమయంలో […]