<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » news
Tigers Death: మన దేశంలో పలు రాష్ట్రాల్లోని అడవుల్లో పులుల సంచారం మళ్ళీ పుంజుకుంది. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే అవి పంట పొలాలలోకి, గ్రామాలలోకి, గూడెలలోకి వస్తున్నాయి. అయితే, స్థానిక ప్రజలు కొందరు పంట పొలాలకి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్ తగిలి మరణించడంతో పాటు మరికొందరు అవగాహనా లోపంతో వేటాడి చంపేస్తున్నారు. ఇలాగే మరో రెండు పులులు బలయ్యాయి. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో, […]
Uttar Pradesh: సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నాయి. రోజూ జరిగే సగం నేరాలు హత్యలు, ఆత్మహత్యలలో ఈ అక్రమ సంబంధాల తాలూకూవే ఉంటున్నాయి. వివాహితులు, అవివాహితులు అనే బేధం లేకుండా మొదలవుతున్న ఈ పక్క చూపులు చివరికి కాపురాలు నాశనం చేస్తున్నాయి. మరికొన్ని విషాదాంతంగా ముగుస్తున్నాయి. ఇందులో యుక్త వయసులోని యువకులు ఎక్కువగా బలవుతున్నారు. ఈ ఘటన కూడా అలాంటిదే. ఉత్తరప్రదేశ్, సోన్భద్ర జిల్లా పరిధిలోని సలైయాదీ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు హరియాణాలో […]
PM Telangana Tour: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అధికార పర్యటలను జరగాల్సి ఉన్నా వివిధ కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోయారు. కాగా, వచ్చేనెల 8వ తేదీన ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అధునాతన స్థాయిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్దరించనున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ […]
TSPSC Paper Leak Case: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులతో పాటు ఆరోపణలు చేసిన వారికి కూడా సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ఆరోపణలు చేయగా.. వాటికి సంబంధించిన ఆధారాలతో ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. నేడు విచారణ […]
Covid19 Cases on Rise: మహమ్మారి కరోనా మానవాళికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. మనిషిని మనిషి తాకేందుకు కూడా భయపడేంతగా హడలెత్తించిన పరిస్థితులు తలచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుట్టక మానదు. మహమ్మారి మన మీద దండెత్తడం మొదలై మూడేళ్లు గడిచిపోయింది. ఈ మూడేళ్ళలో మళ్ళీ విజృంభించినట్లే ఇప్పుడు మళ్ళీ కేసులు పెరగడం మరోసారి ప్రజలలో ఆందోళన మొదలవుతుంది. గత వారం కిందటి వరకు పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసులు తాజాగా వేల సంఖ్యకి […]
Bank Holidays in May: మార్చి చివరి వారం వచ్చేసింది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి మరో ఐదు రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది. ఆర్ధిక సంవత్సరం ముగింపు కావడంతో బ్యాంకులతో ఎక్కువ అవసరం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు, ఉద్యోగస్తులు, డిపాజిట్ దారులు ఇలా ఈ నెలలో వీరికి ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకే చాలా మంది సాధారణ ప్రజలు ఈ నెలలో పనులు ఉన్నా.. వచ్చే నెలకి వాయిదా వేసుకుంటుంటారు. అలాంటి ఆలోచన […]
Weather Update: ఏ ఏడాది వాతావరణంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. మండు వేసవి మార్చిలో వరసగా వర్షాలు కురుస్తున్నాయి. మార్చి నెలలో చిరుజల్లులు పడి వేడి గాలులు మొదలవడం ప్రతి ఏడాది జరిగేదే కాగా.. ఈ ఏడాది మాత్రం వానలు రోజుల తరబడి కొనసాగుతున్నాయి. అది కూడా జోరు వానలు కురవడం కాస్త ఆశ్చర్యంగా కూడా కనిపిస్తుంది. ఓ వైపు పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి అకాల […]
UK: మనకి అర్జంట్ వాష్ రూమ్ అవసరమైనా.. వీలు కాకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో మనకి అందరికీ తెలిసిందే. అందరూ ఏదో ఒక సందర్భంలో ఈ పరిస్థితిని అనుభవించే ఉంటారు. అలాంటిది మూత్ర విసర్జన చేయాలని ఉన్నా 14 నెలల పాటు చేయలేకపోతే ఆ నరకాన్ని ఊహించుకుంటేనే బాబోయ్ అనిపిస్తుంది. కానీ, ఓ మహిళ ఆ నరకాన్ని నెలల పాటు భరించింది. ఆమె జబ్బు ఏంటో డాక్టర్లు కనుకున్నా దానికి చికిత్స లేకపోవడంతో ఆమెకి ఉపశమనం […]
Bahubali Thali: అదే పేర్లు, అదే కూరలు, అదే సాంబార్ అప్పడం, లేకపోతే అదే హైదరాబాద్ చికెన్ బిర్యానీ, అదే నాటుకోడి పెడితే జనాలు ఎగబడి తినే రోజులు పోయాయి. అందుకో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదొక ప్రత్యేకత ఉంటేనే హోటళ్లు, రెస్టారెంట్లు సక్సెస్ అవుతున్నాయి. ట్రైన్, జైల్, హిల్స్, అండర్ వాటర్, రోబోలు ఇలా ఏవేవో కొత్త కొత్త థీమ్స్ తో రెస్టారెంట్లు ఏర్పాటు చేసి జనాలను ఆకట్టుకుంటున్నారు. మరికొందరు కొత్త కొత్త పేర్లు.. లేదా […]
Vande Bharat Express: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ రైలుకు మరో రైలు జత కానుంది. వచ్చే నెలలో సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలును ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మధ్య సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు నడుస్తోంది. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. […]