<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » news
IND vs NZ 3rd ODI: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి వన్డే నేడు ఇండోర్లో జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్లోనూ విజయంసాధించి క్లీన్స్వీప్ చేయాలని భావిస్తోంది. నేడు జరిగే మ్యాచ్లో టీమిండియా తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా […]
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ 25వ తేదీ బుధవారం కడపకు రానున్నారు. యువగళం పేరుతో ఈ నెల 27 నుంచి లోకేశ్ కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ముందుగా కడపకు వచ్చి అమీన్పీర్ దర్గా, మరియాపురం చర్చిలలో లోకేశ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ నుండి తిరుమలకి వెళ్లి 26న వేంకటేశ్వరుని దర్శనం చేసుకొని అదే రోజు కుప్పం వెళ్లనున్నారు. ఆ తర్వాత రోజు 27న పాదయాత్ర […]
Viveka Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకి […]
Rahul Gandhi: పాలిటిక్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తొచ్చేది రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 50 ఏళ్లు దాటినా ఇంకా ఓ ఇంటివాడు కాలేదు. ఆయన పెళ్లి గురించి గతంలో అనేక పుకార్లు షికార్లు చేశాయి. అదిగో రాహుల్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నారని.. రాహుల్ చేసుకోబోయే అమ్మాయి ఈమెనే అంటూ ఏవేవో పుకార్లు షికార్లు చేశాయి. కానీ అవేమీ నిజం కాలేదు. రాహుల్ పెళ్ళెప్పుడు అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ […]
Hyderabad: హైదరాబాద్ నగరంలో ఒకవైపు చైన్ స్నాచింగ్ లు, మరోవైపు చోరీలు హడలెత్తిస్తున్నాయి. నగరంలో అంతకంతకు క్రైమ్ రేట్ గణనీయంగా పెరుగుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఒకవైపు దొంగతనాలు, హత్యలు, యాక్సిడెంట్లు, అత్యాచారాల వంటి ఘటనలు నిత్యకృత్యమవగా.. మరోవైపు డ్రగ్స్ రాకెట్స్ బయటపడుతుండడంతో అసలేం జరుగుతుంది హైదరాబాద్ లో అన్నది అంతు చిక్కడం లేదు. నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకొచ్చి శిక్షలు విధిస్తుంది. నేరం ఎలాంటిదైనా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుంటున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా […]
AP Govt: తమ జీతాలు ఆలస్యమవుతున్నాయని.. నెల పొడవునా జీతాలు అసలు ఎప్పుడు జమ అవుతాయో కూడా తెలియడం లేదని.. పెన్షన్లు, బకాయిలు నెలాఖరు వరకు కూడా జమ కావడం లేదని.. ఉద్యోగుల అనుమతి లేకుండానే ఉద్యోగుల ఖాతాల నుంచి జీపీఎస్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారని.. మీ అధికారాలను ఉపయోగించుకొని జీతాలు సమయానికి అందేలా చూడాలని ఒక ఏపీ ఉద్యోగుల సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు గవర్నర్ […]
Hyderabad: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో డిప్యూటీ తహశీల్దార్ చొరబడిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉద్యోగ విషయం మాట్లాడేందుకు ఆయన స్మిత సబర్వాల్ ఇంట్లోకి వెళ్లినట్లు చెప్పాడు. అయితే అసలు ఆయనెవరో ఆమెకు తెలియదు. అలాంటి వ్యక్తి రాత్రిపూట నేరుగా ఇంట్లోకి రావడంతో.. స్మిత సబర్వాల్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగగా.. ఆదివారం వరకు పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు. […]
Tamilanadu: ఈ మధ్య కాలంలో కొంతమంది మనుషులకన్నా కుక్కలనే ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇంట్లో తల్లి, దండ్రులను ప్రేమగా చూడలేరు కానీ.. కుక్కలని, పిల్లులను మాత్రం బుజ్జీ, కన్నా అంటూ గారాబం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు మన సమాజంలో. వీళ్ళు వాళ్ళ పెట్స్ ని ఎలా పడితే అలా పిలిచినా ఒప్పుకోరు. కుక్కని కుక్క అని పిలిచినా వాళ్లకి కోపం వచ్చేస్తుంది. అలా కోపం వచ్చి కుక్కని కుక్క అని పిలిచిన పాపానికి వృద్ధుడిని కొట్టి చంపేశారు. తమిళనాడు రాష్ట్రంలో […]
Warangal: కొందరు యువకులు లేడీస్ హాస్టల్స్ నే టార్గెట్ చేసుకున్నారు. అంటే అక్కడున్న మహిళలపై ఏదో అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని కాదు. కేవలం లేడీస్ హాస్టల్స్ లోనే దొంగతనాలు చేస్తున్నారు. ఆ తర్వాత చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. లేడీస్ హాస్టల్లో చోరీలు హస్మకొండ జిల్లాలో కలకలం రేపాయి. అక్కడి ఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో లాప్టాప్ లు, సెల్ ఫోన్లు దొంగతనం చేశారు. హాస్టల్ బాత్రూమ్ డోర్ బద్దలు […]
Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఎంపీ.. భారతదేశంలో ముస్లింలు ఏకతాటిపై వచ్చి రాజకీయంగా ఓ లీడర్షిప్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదు. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 70 సంవత్సరాల నుంచి మమ్మల్ని దోచుకున్నారు. ఈ దేశంలో అగ్రకులస్తులే రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, మైనార్టీ హిందువులు, ముస్లింలు, […]