<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
iTDP: టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు, ఐటీడీపీ ఇంచార్జ్ చింతకాయల విజయ్ ఏపీ సీఐడీ విచారణకు హాజరయ్యారు. పార్టీ నేతలు, లాయర్లతో కలిసి విజయ్ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. విజయ్ సీఐడీ విచారణకు హాజరవుతున్నారనే సమాచారంతో కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా బలగాలను మోహరించారు. విజయ్ పై కేసు ఏంటి? సీఎం జగన్ భార్య వైఎస్ భారతి లక్ష్యంగా గత […]
Ramireddy Pratap Kumar Reddy: మేమేమీ సత్యవంతులం కాదు.. అవినీతి కూడా కొత్తేమీ కాదు.. అవినీతి జరగలేదని మేమేమీ మీకు చెప్పడం లేదు. ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగింది కానీ.. గత ప్రభుత్వంలో ఇంతకి మించి ఎక్కువగానే జరిగింది. ఇదీ నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు. కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఓ సమావేశంలో, విలేకర్ల ముందే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో […]
Ojuelegba bridge accident: రెండు బస్సులపైకి దూసుకెళ్లిన రెండు భారీ వాహనాల వేర్వేరు ప్రమాదాలలో ఇద్దరు చిన్నారుల సహా ఇరవై మంది మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. అందులో ఒక ప్రమాదంలో భారీ కంటైనర్ బస్సుపై పడగా.. ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మరణించారు. మరో ప్రమాదంలో ఓ భారీ ట్రక్కు బస్సును ఢీ కొట్టడంతో మరో 11 మంది మరణించారు. నైజీరియా లాగోస్ లో ఈ రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఓజులెగ్బా […]
AP Govt: జీతాలు సకాలంలో వచ్చేలా చూడండి మహాప్రభో అంటూ ఏపీ ఉద్యోగ సంఘం ఒకటి గవర్నర్ బీబీ హరిచందన్ ను కలిసి విన్నవించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్కు ఫిర్యాదు చేయటం రోసాకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అయితే వాటిని వినియోగించకుండా గవర్న ర్ ను ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. […]
Naba Kisore Das: ఒడిశాలోని బ్రిజరాజ్ నగర్ లో ఆదివారం ఉదయం ఏఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవకిశోర్ దాస్ కన్నుమూశారు. కాల్పుల్లో ఆయన ఛాతి భాగంలోకి తూటా దూసుకెళ్లడంతో చికిత్సపొందుతూ మంత్రి ప్రాణాలు విడిచినట్టు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.నిజానికి ఆస్పత్రికి తీసుకురాగానే డాక్టర్ దేబాశిస్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం హుటాహుటిన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. అయితే, ఆయన శరీరంలోకి దూసుకెళ్లిన ఓ బుల్లెట్ గుండె, ఎడమ […]
AP CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన బాట పట్టనున్నారు. రేపు ఎల్లుండి అనగా సోమ, మంగళ వారాలు రెండు రోజులపాటు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెల 30, 31 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనుండగా.. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరి 6.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. వన్ జన్పథ్ నివాసంలో రాత్రికి […]
Ambati Rambabu: ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు టీడీపీ నుండి నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టి అధికార పార్టీని ఎండగడుతుంటే.. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం నుండి మంత్రుల వరకు అందరినీ తూర్పారా పట్టేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొట్టే పనిలో ఉన్నారు. మొత్తంగా మాటకి మాట అన్నట్లు రాజకీయం రసకందాయంగా సాగుతుంది. నారా లోకేశ్ పాదయాత్రలో చేసిన వ్యమర్శలపై […]
Naba Kisore Das: ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవ కిషోర్ దాస్ పై ఓ పోలీస్ అధికారి కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో మంత్రి ఛాతీకి బుల్లెట్ గాయాలు కాగా.. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఒడిశాలోని ఝార్సుగూడా జిల్లా బజరంగ్ టౌన్ లో ఓ మీటింగ్ కి హాజరయ్యేందుకు కిశోర్ దాస్ వెళ్తుండగా ఈ కాల్పులు జరిపారు. గోపాల్ దాస్ అనే అసిస్టెంట్ […]
BRS-BJP: తెలంగాణలో ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైంది. ఒకపక్క సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా జాతీయ స్థాయిలో రాజకీయాలు మొదలు పెట్టి పార్టీ విస్తరణలో పనిలో ఉండగా.. బీజేపీ ఎలాగైనా తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతుంది. షాడో సీఎంగా పేరున్న మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు బీజేపీకి కౌంటర్లు ఇస్తూ రాజకీయ వేడి పెంచేస్తున్నారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రండి.. మేం అసెంబ్లీ రద్దు చేస్తాం.. ముందస్తు ఎన్నికలకు అందరం […]
Jr NTR-Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితులపై అందరిలోనూ ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉందని తెలియడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరు నారాయణ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇటు నారా-నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకోగా.. తాజాగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీప్రణతి కూడా బెంగళూరు వచ్చారు. వీరితో పాటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కూడా ఆస్పత్రికి చేరుకుని తారకరత్న […]