<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Gannavaram Riots: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ ఆఫీసు దహనం ఘటన రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న కారణం, చంద్రబాబుపై వంశీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతల కౌంటర్ విమర్శలతో వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న హింసకు కారణమయ్యారనే ఆరోపణలతో విజయవాడ టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. […]
BRS-AIMIM: ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి నెల 13వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానంతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎవరిని నిలబెడుతుంది.. బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా అనే ఆసక్తి కనిపించింది. అయితే, ఎంఐఎం పార్టీని మిత్రపక్షంగానే చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ […]
Loan App Harassment: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. రిజర్వ్ బ్యాంక్ నుండి లోకల్ రుణ సంస్థల వరకు ఎంత అవగాహనా కల్పించినా.. ఆన్లైన్ రుణ యాప్ ల నుండి అప్పులు తీసుకోవడం ఆగడం లేదు.. వారి వేధింపులు ఆగడం లేదు. అవి తట్టుకోలేక ఆత్మహత్యలు ఆగడం లేదు. లోన్ యాప్స్ అమాయకులకు అప్పు ఇచ్చి లక్షల్లో దండుకుంటున్నాయి. అప్పు తీర్చినా కూడా వేధింపులు ఆపడం లేదు. ఇలా లోన్ యాప్ వేధింపులు తాళలేక ఇప్పటికే చాలా […]
Etela Rajender: తెలంగాణలో రైతులకు కనుక 24 గంటల మూడు ఫేజ్ల కరెంటు వస్తుందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఛాలెంజ్ విసిరారు. అసలే ఎన్నికల కాలం.. పైగా రాజకీయ పార్టీలు దూకుడు పెంచాల్సిన సమయం. అందుకే ఒక్కో నేత ఒక్కోలా కామెంట్స్ చేసి రాజకీయాలలో వేడి పెంచుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ […]
Byreddy Rajasekhar Reddy: ఏపీలోని మూడు ప్రాంతాల మధ్య రాయలసీమ ఇప్పుడు సుడిగుండంలో ఇరుక్కుపోయిందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంతం పరిస్థితి ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న పేషంట్ మాదిరి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సంగమేశ్వరం వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మిస్తే రాయలసీమకి తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. తీగల వంతెన వద్దని ఎమ్యెల్యే, […]
Killer Wife: మనుషులలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో దేశంలో దిగ్బ్రాంతికి గురి చేసే హత్యోదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతిని సాహిల్ గహ్లోత్ అనే యువకుడు చంపేసి దాబాలోని ఫ్రిజ్లో దాచిపెట్టిన ఘటన చూసే ఉంటారు. అదే ఢిల్లీలో సహజీవన భాగస్వామి శ్రద్ధావాకర్ ప్రాణం తీసి ముక్కలు చేసి చెల్లాచెదురుగా పడేసిన ఆఫ్తాబ్ పూనవాలా ఘటన కూడా మరిచిపోనేలేదు. ఈలోగా అంతకి మించి కిరాతంగా మర్డర్ మరొకటి […]
Tamilisai Soundararajan: తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సొంతరాష్ట్రమైన తమిళనాడులో రెండు రోజులుగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. తమిళ ప్రజలు నా ప్రతిభను గుర్తించి ఉంటే.. కేంద్ర మంత్రిగా పార్లమెంట్ లో తమిళ ప్రజల కోసం పోరాడేదాన్ని అని.. తమిళులు గుర్తించకపోయినా నా ప్రతిభను కేంద్రం గురించి ఉన్నత పదవులలో కూర్చోబెట్టిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోయంబత్తూరులోని పీళమేడులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్ […]
TDP-YSRCP: కృష్ణాజిల్లా గన్నవరంలో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య మంటలు ఇంకా చల్లారలేదు. టీడీపీ నుండి గెలిచి వైసీపీకి సానుభూతిపరుడిగా మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. దానికి కౌంటర్ గా టీడీపీ నేతలు వంశీపై తీవ్ర విమర్శలకు దిగడంతో మొదలైన ఈ రగడ వంశీ టీడీపీ ఆఫీసుపై దాడి వరకు కొనసాగింది. సోమవారం వంశీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసుపై దాడి […]
Yadadri Temple: తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. నేటి నుండి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూ కట్టారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత మొదటిసారిగా లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. విష్వక్సేన ఆరాధనతో ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు మార్చి […]
TDP-YSRCP: కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య ఘర్షణ నేపథ్యంలో హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వంశీ వ్యక్తిగతంగా విమర్శించారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వంశీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహించిన వంశీ అనుచరులు సోమవారం టీడీపీ కార్యాలయంపై […]